– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-నవాబుపేట్
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాలను 21 రోజులు పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించు కోవాలని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య అన్నారు. మండలంలోని మండల పరిషత్ కార్యా లయంలో దశాబ్ది ఉత్సవాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి గోపాల్, ఎంపీడీవో సుమిత్రమ్మల అధ్యక్షతన వహించిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మండలంలో ఘనంగా నిర్వహించాలన్నారు.ఈ ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ ప్రశాంత్గౌడ్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రావుగారి వెంకట్రెడ్డి, సర్పంచులు రత్నం మహమ్మద్ రఫీ, పద్మ, కిష్టయ్య, నర్సింలు, సుధాకర్ రెడ్డి, శ్రీలత సుధాకర్రెడ్డి, విమలమ్మ రంగారెడ్డి, నాయకులు దయాకర్ రెడ్డి, నాగిరెడ్డి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.