ధన్ను!

Dhannu!వెండి నాణాలు చెలామణిలో ఉన్న రోజులు అవి. అప్పట్లో అర్ధ రూపాయిని దహిలి అని, పావలాను పొలి అని గ్రామీణులు చెప్పుకొంటూ ఉండేవారు. ధన్ను ఆ గ్రామంలో అందరి తలలో నాలికలా ఉండేది. పిన తల్లిగా వ్యవహారించబడేది.
‘దేవుడు ఆడదాన్ని మొదట్నుంచే దహిలి లా పుట్టించాడు. మొత్తం రూపాయిగా జీవించే ఆడోళ్ళ జీవితమే వేరు. తనకిష్టమైన మొగుడు దొరకడం… అదో అదష్టం. కాని అలాంటి వారిని తను చూడలేదు… వారి గురించి విననూ లేదు! ఇండ్లల్లో దహిలిలే దహిలిలు. ఇద్దరు ముగ్గురు అడపిల్లల్ని కనేసి… లోకం విడిచి వెళ్లిపోయారు… తల్లులు’ ధన్ను తరచుగా అమ్మలక్కలకు చెప్పే మాటలివి.
‘ధన్ను నోరు తో గెలవ లేం. గయ్యాళి నోరు’ అని ఆమె వెనుకాల చెప్పుకొంటూండే వారు. కాని ధన్ను ఎదుట మాత్రం అందరి నాలికలు పిడచకట్టుకపోతాయి! ఒక్క ముక్క కూడా ఆమెకు వ్యతిరేకంగా ఎవరి నోట్లోంచి బయటికి వెలువడదు!
ఓ సారి కేసరు నశ్రీశీ వటతీషఆమె మొహం మీదనే ఓ విషయం అడిగింది మొహమాట పడకుండా! ధన్ను ఆమెను బాగా మందలించింది. కేసరు చెవులు పట్టుకుంది.
”చెల్లెమ్మా రాత్రికి నీ దహిలి కూడా నా దహిలి లాగే చెలామణిలో ఉంటుంది” లో స్వరం లోనే చెప్పింది. ఆ తర్వాత ధన్ను ఆ ఊరిలోని ఆడవాళ్లందరికి దీని గురించి చెబుతుంది. కేసరు సిగ్గుతో కొన్ని వారాల వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు.
మరో అమ్మాయి గురించి చెబుతూ, ”చూడరాదు! మనూరి పెద్దోడి దగ్గర, తన ముసలి మొగడి దగ్గర చెల్లని దహిలిని, ఆంబోతులాంటి తన మరదితో చెల్లించుకుంది. ఆమె దురుసు నోరుకు ఆ ఊరిలోని ఆడవాళ్లందరు జడుసుకునే వారు. అంతటితో ఆమె ఆగలేదు. వరుసబెట్టి మరికొన్ని రహస్యాలు బయట పెట్టేది. చిమ్ము గాడి బ్లుంతును ఎవరు మరచి పోయారు. పెద్ద గర్వంగా పల్లకీ లోంచి దిగింది. ఏడవ నెలలోనె ఆమెకు ఓ అబ్బాయి పుట్టాడు… వడాచు గాడి ఆడది నాలెగేండ్ల నుంచి మొగుడి మొహం చూడ లేదు కాని నాటు మందు ఉడికించి ఉడికించి తాగుతూండేది.
ధన్నుకు ఊరిలోని మిగతా ఆడవాళ్ల గురించి తెలియక పోయిన వాళ్ల అమ్మాయిల పేర్లను లెక్కించేది.
”నువ్వు పెద్ద తెలివైనదానిలా తిరుగుతున్నావ్‌. నీ కులుకుల కూతురుకు పగ్గం వెయ్యి. సింధువు తో దహిలిని మార్చుకొంటూ తిరుగుతుంది… ఓరు! నువ్వు ధర్మనె! వీరు పెండ్లెందుకు చేయవ్‌? అది గురుద్వారే తమ్ముడితో పొలాల్లో చండులాడుతుంది… ఇంకా… ఇలా… ఇలా ఆమె చెప్పుకొంటూనే ఉంటుంది.
ఊరి ఆడవాళ్లందరు చెంప లేసుకోసాగారు. ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఆమె నోటి దురుసుతనానికి భయపడి ఆమె జోలికి వెళ్లేవారుకాదు. కాని వాళ్లకు ఆమె తో అప్పుడప్పుడు ఏదో విధంగా పని పడుతూనే ఉండేది. వాళ్ల పిల్లలకు పడిశం పడితే ధన్ను దగ్గరికి వచ్చేవాళ్లు. ఆమె నీళ్లలో సోంప్‌ మరగ పెట్టి, ఆ నీళ్లు తాగించేది. పిల్లలు అన్నం తినకపోయినా, జ్వరం వచ్చినా గత్యంతరం లేక వాళ్లు ధన్ను దర్వాజ తలుపులు తట్టే వారు. ధన్ను వేడి నెయ్యిలో తన బొటన వేలు, చూపుడు వేలు పెట్టి నెయ్యి తీసి పిల్లల గొంతు పై రాసేది. రెండవ రోజు ఆ పిల్లాడు ఆడుకునేవాడు!
ధన్ను పుట్టు పూర్వోత్తరాలెవరికీ తెలియవు. ఆమె తలిదండ్రులెవరు? ఆమె మతమేమిటి! ఆమె బంధువులెవరో? అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కాని ఆమె ఓ మంచి కుటుంబానికి చెందినదని చెప్పుకొంటుంటారు.
ధన్ను తన యుక్త వయసులో ఒకరి మీద మనసు పారేసుకుంది. కాని అతడు తన ఇంట్లోంచి గెంటివేయబడడ్డవాడు. చూపుకు చాలా ఆకర్షణీయంగా ఉన్నా, పని పాటల్లేకుండా ఆవారాలా తిరిగేవాడు, దద్దమ్మ. ఓ రెండు వారాలు ఆమెతో గడిపి, ధన్నును ఎక్కడైనా అమ్మేద్దామనుకున్నాడు. ధన్ను తెగించి, ”నేను వెళ్లేముందు నా కొంగు ముడిలో దాచుకొన్న దహిలి (వెండి నాణెం)ను మార్పించి నీ జేబులు నింపి వెళ్లడమెందుకు?” సూటిగా ప్రశ్నించింది. ఆమె కోపం తారస్థాయికి చేరుకుంది. ధన్నుకు జన్మనిచ్చిన వారితో గాని లేదా పారిపోయి వచ్చిన వాడితో గాని ఆమెకు ఎలాంటి సంబంధాలూ లేవు!?
ఓ ఊరి గాలివార్త ప్రకారం ఓ చిన్న జమీందారు ధన్ను పై మనసు పారేసుకొని తనింట్లోకి తెచ్చుకున్నాడు. కాని ఇంట్లో తన కొడుకుల గొడవలతో సాగ లేక ఆమె కోసం తనింటి వాళ్లెవ్వరికి తెలియకుండా రెండెకరాల భూమి కొన్నాడు. ఆమె పేరున ఆ భూమిని ఉంచాడు. అంతేకాదు ఆమె కోసం వేరుగా ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు. అతడు జీవించి ఉన్నంత వరకు ధన్ను బాగోగులు చూసుకునే వాడు. కొన్నాళ్ల తర్వాత అతడు చనిపోయాడు. ధన్ను తన విధిగా, తన తీరుగా బతక సాగింది.
ధన్ను తనలో తానే అనుకొంటుండేది, ‘బెంగెందుకు బేబే! రూక (వెండినాణెం) కొంగుకు ముడి వేసుంది. అవసరమున్నప్పుడు మార్పించుకొంటాను.’
ఒక సారి ఓ యువకుడు ధన్నుకు దగ్గరగా కూర్చుని అడిగాడు, ”నీ దహిలి చూపించు ఎలా పెట్టావో!”
ధన్ను అతడి గొంతు పై గట్టిగా చేతి తో నొక్కి పెట్టి అంది. ”పద చూపిస్తాను…నీ అమ్మ షల్వార్‌లో ఉంది…!” ఆ తర్వాత ఆ ఊరిలోని ఏ మొగాడికి కూడా ఆమె వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేక పోయింది.
ధన్ను ధైర్య సహాసాలతో జీవించసాగింది.
కాలక్రమంలో ధన్ను మిలమిలాడే వయసు బలహీన పడసాగింది. కాని ఆమె ముక్కుపుడక ఆమె స్వభావంలా ప్రకాశిస్తూనే ఉంది. కండ్లెదురుగా పొలాలలో నాగలితో దున్నుతున్న దశ్యాన్ని చూడసాగింది. దొరసానిలాంటి పొగరుతో జీవించసాగింది.
ఓ సారి ధన్ను జబ్బు పడింది. ఇరవై ఒక్క రోజుల తర్వాత తగ్గుముఖం పట్టింది. ధన్నుకు తన ఆరోగ్యం మీద నమ్మకం క్షీణించసాగింది. ఒక రోజు ఆమె దగ్గర్లోనే ఉన్న పట్టణంకు వెళ్లింది. వెంట తన పొలం, ఇంటి కాగితలను తీసుకొని వెళ్లింది.
ఊరిలో పుకారు మొదలైంది. ధన్ను వీలునామా రాయించిందని!
కొన్ని రోజులకు ముందు ఓ సాయంత్రం సీము పొలాల నుంచి ఇంటికి రాసాగింది. పటేలు కొడుకు బాగా సారా తాగి తడబడుతున్న కాళ్లతో దూరం నుంచి సీము ను చూశాడు. ఆమె దారికి అడ్డుపడ్డాడు. అటు వైపు నుంచి కాకతాళియంగా ధన్ను కూడా అదే మార్గంలో రాసాగింది. సీము ఆమెను చూసి గట్టిగా అరిచింది సహాయం కోసం. ధన్ను ఆగమేఘాల మీద పరుగెత్తుకొంటూ ఆమె దగ్గరికి చేరింది. ఆమెను సురక్షితంగా ఆమె ఇంటివరకు దిగబెట్టింది. ఈ సంఘటనతో సీము కొద్దిగా చనువు తీసుకొని, సహాసించి అడిగింది, ”అమ్మోరు! (పిన్ని) నీ పొలాన్ని ఎవరికో రాసిచ్చవ్‌ అని విన్నానే! ఎవరికే”
ధన్ను మొహం కోపంతో ఎర్రగా మారింది.
”అవును బిడ్డా! నీకిప్పుడు పిన్ని గుర్తుకొచ్చింది!? నీ అమ్మ నేను కవలలుగా పుట్టాం. అందుకే నేను నీకు పిన్ని నయ్యాను. అవునా?”
ధన్ను స్వరం విని సీము భయపడిపోయింది.
కోప్పడతావెందుకు పిన్ని! జనాలనుకొంటున్నారు. నువ్వు నీ ఆస్తిని గురుద్వారే పేరున రాశావు అని. నేనిలాగే ఊరికే అడిగాను. చెప్పుకోవాలంటే నువ్వు పుణ్యం పనే చేశావ్‌”.
ధన్ను ఆమె పై నిప్పురవ్వల్లాంటి వర్షం కురిపించింది. గురుద్వారే తమ్ముడు తోడేలు. మొదట్నుంచే వాడు హల్వా తింటున్నాడు. వాడి కోసం హల్వా తెచ్చిపెట్టడానికి మీ అమ్మలున్నారుగా! మీ పిన్ని ఇలాంటి మంచి పనులు చేయదు.”
సీము చెవులు మూసుకొని అక్కణుంచి పలాయన మంత్రం పఠించింది. ఆ తర్వాత ధన్నుతో ఈ విషయం గురించి ఆరా తీయడానికి ఎవరి దగ్గర దమ్ముల్లేకుండా పోయాయి.
దన్ను తన భవిష్యత్తేమిటో తెలుసుకున్నట్లుగానే తనింకా ఎన్ని రోజులుండగలదో కూడా తెలుసుకుంది. అమెకు కొన్ని రోజుల తర్వాత మళ్లి జబ్బు పట్టుకుంది. ఈ సారి ఊర్లో ఉన్న వారందరికి ఆమె బతికే నమ్మక సన్నగిల్లింది.
ఓ రోజు ఊరిలోని ఓ పెద్దావిడ ధైర్యం జేసి, ఆమె చెవిలో నెమ్మదిగా అంది, ”గతం గతహ ధన్ను! చివరి ఘడియలోనైన ఒప్పుకుంటే ఒరిగేదేవిమీ లేదు. రామా… రామా… నామం జపించని వాళ్లు కూడా.. మనసులో తలచుకున్న వైకుంఠం వెళ్లిపోతారు…”
ధన్ను తన చివరి ఘడియలలో కూడా నవ్వుతు అంది, ”భగత్నె! నా గురించి బెంగెందుకు పడతావ్‌? ధర్మరాజుకు నా లెక్క చెప్పుకుంటాను. నా కొంగులో ముడిపడి ఉన్న ఈ దహిలిని మార్చుకో… నా నా లెక్క ముగించు అని అంటాను”
భగతి తన రెండు చెవుల్లో వేళ్లు పెట్టుకొని ధన్ను ఇంట్లోంచి బయటికొచ్చింది.
రెండవ రోజు మధ్యాహ్నం దన్ను చనిపోయింది.
ధన్ను కర్మ అయ్యాక ఊరి పెద్దలు ఆమె ట్రంకు పెట్టెను తెరిచారు. అందులో ఉన్న వీలునామ దొరికింది. ధన్ను తన పొలాన్ని/ భూమిని ఊరులో బడి కోసం రాయించింది. అందులో ప్రత్యేకంగా రాయించిన ఒక నోట్‌ కూడా ఉంది- ‘నాకున్న ఒకే ఒక కోరిక… అమ్మాయిలకు ఓ నాలుగు అక్షర ముక్కలు నేర్పాలి. వారి జీవితం బజారుపాలు కాకుండా ఉండాలి’.
– మొహ్మద్‌ అమ్జద్‌ అలీ,
00 966 507662638

మూల రచయిత్రి : అమతా ప్రీతం
తెలుగు అనువాదం : అమ్జద్‌

Spread the love