బీజేపీ వంద అబద్ధాలు

– బుక్‌లెట్‌, సీడీలను ఆవిష్కరించిన కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను, తెలంగాణకు చేసిన అన్యాయాలను వివరిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం రూపొందించిన ‘బీజేపీ వంద అబద్దాలు’ బుక్‌లెట్‌, సీడీనీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో సోమవారం ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం నాలుగు నెలలుగా బీజేపీ వైఫల్యాలను బట్టబయలు చేస్తూ వస్తోంది. బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీనర్లు మన్నె క్రిషాంక్‌, వై.సతీష్‌రెడ్డి, జగన్‌ మోహస్‌రావు, దినేష్‌చౌదరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోడీ సర్కారు ఎలా మోసం చేసింది? తెలంగాణ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిని ఎలా అడ్డుకుంటున్నారనే విషయాలను ఇందులో వివరించారు. బీజేపీ తప్పులను ప్రతీరోజు బయటపెడుతున్నామని తెలిపారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారంగా మారిన జీఎస్టీ, ప్రతీ ఇంటికి ఇంటర్నెట్‌ సదుపాయం, అందరికీ ఇల్లు, విభజన హామీల అమలు, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌, ఐటీఐఆర్‌, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు బీజేపీ నాయకుల అసలు రూపాన్ని ఈ క్యాంపెయిన్‌లో బయటపెట్టడం జరిగిందని వారు తెలిపారు. సోషల్‌ మీడియా కన్వీనర్లు చేపట్టిన ‘బీజేపీ వంద అబద్దాలు’ క్యాంపెయిన్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. అబద్దాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచారని కొనియాడారు. బుక్‌లెట్‌, సీడీ ద్వారా బీజేపీ తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌, ఎంపీ బీబీ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.
అళహ సింగరాచార్యుల మృతికి కేటీఆర్‌ సంతాపం
ప్రముఖ సంపాదకులు కె.శ్రీనివాస్‌ తండ్రి, ప్రముఖ తెలుగు సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం ప్రకటించారు. అళహ సింగరాచార్యుల కుమారుడు ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
వాస్‌ కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Spread the love