అదే జరిగితే దానంకు కేంద్ర మంత్రి పదవి వస్తుంది: రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి దానం నాగేందర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు సికింద్రాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ… సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దానం నాగేందర్ కేంద్ర మంత్రి కావడం ఖాయమని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రేవంత్ మండిపడ్డారు. పద్మారావు చాలా మంచి వ్యక్తి అని… ఆయన పరువు తీయడానికే సికింద్రాబాద్ నుంచి పోటీలో నిలిపారని అన్నారు. కేసీఆర్ ను నమ్ముకుంటే పద్మారావు నిండా మునిగినట్టేనని చెప్పారు. పద్మారావు నామినేషన్ కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ టికెట్ ను బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

Spread the love