మల్లిక్ బాబు, వినరు, ఇషా, ప్రియాన్స్ హీరో, హీరోయన్లుగా నటిస్తున్న సినిమా ‘దుమారం’. సుమన్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని జీఎల్బీ సినిమా బ్యానర్ పై జీఎల్బీ శ్రీనివాస్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత జీఎల్బీ శ్రీనివాస్ మాట్లాడుతూ,’నాయి బ్రహ్మణుల జీవితాల నేపథ్యంతో సాగే చిత్రమిది.
పూర్తి కమర్షియల్ అంశాలతో సాగుతుంది. సోమవారం నుంచి కొమురవెళ్లిలో చిత్రీకరణ కొనసాగిస్తాం. హీరో తండ్రి పాత్రలో సుమన్ నటిస్తున్నారు. అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’ అని తెలిపారు.’నాయి బ్రాహ్మణుల జీవితాలు, ఈ వత్తిలో వారు పడుతున్న ఇబ్బందులను ఈ సినిమాలో చూపిస్తున్నాం. నేను బార్బర్ క్యారెక్టర్ చేస్తున్నాను’ అని సుమన్ చెప్పారు.