లోకసభ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా కత్తి వెంకటస్వామి గౌడ్

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ :  ఎఐసిసి జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్  దీపా దాస్ మున్షి  కత్తి వెంకటస్వామి గౌడ్  ను లోకసభ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ మండల తిరుపతి గౌడ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి పార్టీ గుర్తింపును ఇస్తుందని ఆయన తెలిపారు
Spread the love