ఎంపీపీ, జడ్పీటీసీ
నవతెలంగాణ-మర్పల్లి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన దశాబ్ది ఉత్సవాలను 21 రోజులు మండలంలో ఘనంగా నిర్వహించు కుందామని ఎంపీపీ బట్టు లలిత రమేష్, జడ్పీటీసీ మధుకర్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మండలంలో ఘనంగా నిర్వహించాలని వారన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు సమన్వ యంతో ఏర్పాట్లు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహి స్తోందన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 21 రోజులపాటు కార్యక్రమాలను సమన్వయంతో కార్యక్రమాలను సంతోషంగా జరుపు కుందామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ అనిత, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు సోహెల్, ఎంపీడీవో రాజ మల్లయ్య, తహసీల్దార్ శ్రీధర్, సూపరింటెండెంట్ కృషా ్ణరావు, ఎంపీఓ మహేష్కుమార్, విద్యాధికారి విద్యాసాగర్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.