మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నాం పూర్ణ చందర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల బీఆర్ఎస్ పార్టీ చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు నామ్ పూర్ణ చందర్ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆస్పత్రిలో చేరారు. గత రెండు రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న పూర్ణచందర్ ములుగులో చూపించుకోగా అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ముత్యం కిడ్నీ సెంటర్ లో అడ్మిట్ అయ్యారు. కాగా శనివారం పూర్ణచందర్ కిడ్నీలకు శస్త్ర చికిత్స చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుండి పూర్వచందర్ క్రియాశీలకంగా రాణిస్తూ తనదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కాగా అనారోగ్యం పాడిన పడిన పూర్ణచందర్ ను చల్వాయి గ్రామానికి చెందిన మోడల్ పాఠశాల చైర్మన్ రేణుల సంతోష్ ఆ పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బై కానీ ఓదెలు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సత్తుపల్లి పరామర్శించి త్వరలోనే కోలుకుంటారని ధైర్యం చెప్పారు. పూర్తిస్థాయిలో త్వరలోనే కోలుకొని తిరిగి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పూర్వం మాదిరిగానే పని చేస్తారని గ్రామస్తులు ఆశిస్తున్నామని తెలిపారు.

Spread the love