రైలు ప్రమాద ఘటనా స్థలానికి బయలుదేరిన ప్రధాని మోడీ

నవతెలంగాణ – ఒడిశా: రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోడీ భేటీ అయ్యారు. ఘటనా స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఢిల్లీ నుంచే పర్యవేక్షించారు. రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు, ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని బయలుదేరినట్టు సమాచారం. ప్రమాద స్థలంలో పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరపడంతో పాటు కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు.

Spread the love