ఘనంగా శ్రీ విద్యాపీఠం సిద్దిపేట ధ్యాన మహ సంబరాలు..

నవతెలంగాణ – సిద్దిపేట : సిద్దిపేట శ్రీ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో ధ్యాన మహా సంబరాలు శుక్రవారం స్థానిక విపంచికళా నిలయంలో ఘనంగా నిర్వహించారు. ధ్యాన మహోత్సవ సంబరాల్లో భాగంగా చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు,  జానపద గేయాలపై నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీ విద్యాపీఠం ముఖ్య అధ్యక్షురాలు శ్రీవిద్య మాట్లాడుతూ ప్రతి మహిళా ధ్యాన మహిళ కావాలని ఆకాంక్షిస్తూ ఉచితంగా ధ్యాన ప్రచారం చేస్తూ,  ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి స్త్రీ మూర్తిని, వారి పిల్లల్ని ధ్యాన ప్రపంచం వైపు అవగాహన కల్పిస్తూ,  సజ్జన సాంగత్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ,  ఉచితంగా ధ్యానం  భోదిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆధ్యాత్మిక సంస్థల సభ్యులు, ప్రజాపిత బ్రహ్మ కుమారి సంస్థ, పిరమిడ్ స్పిరుచ్యువల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love