జహీరాబాద్ గెలుపే లక్ష్యంగా సమాలోచనలు చేసిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు

నవతెలంగాణ-  కంటేశ్వర్
నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షిని కలిసిన జహీరాబాద్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు జీవన్ రెడ్డి సురేష్ షెట్కర్ ముఖ్య నాయకులు,  ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు గెలుపే లక్ష్యంగా సమాలోచనలు చేశారు. శుక్రవారం క్షుణ్ణంగా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిజామాబాద్ జహీరాబాద్ అస్తిత్వానికి..అభివృద్ధికి ఆటంకంగా మారిన ధర్మపురి అరవింద్ బీబీ పాటిల్ ను గద్దె దించే సమయం ఆసన్నమైంది. లోక్ సభలో నిజామాబాద్ జహీరాబాద్ వాణి గట్టిగా వినిపించాలన్నా, అభివృద్ధి గట్టిగా జరగాలన్నా, పేద ప్రజల  అభివృద్ధికై అనుక్షణం తపించే  జీవన్ రెడ్డి  సురేష్ కుమార్ షెట్కార్ ని మన నిజామాబాద్ జహీరాబాద్ నుండి ఎంపీలు గా అఖండ మెజారిటీతో గెలిపించాలి. న్యాయం మీకు హక్కుగా లభించేంత దాకా మా ఈ  పోరాటం ఆగదు. మీకోసం మేము చేసే పోరాటానికి మద్దతునివ్వండి, అందరికి న్యాయం జరిగేలా అందరి జీవితాలలో కాంతులు నిండేలా, ఆరు గ్యారంటీలు ఐదు న్యాయాలతో మీ మీ ముందుకు వస్తున్న మా నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డిని జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి  సురేష్ షెట్కార్ని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి అని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కోరారు.
Spread the love