కేతేశ్వర విగ్రహ ప్రతిష్టపనలో అర్బన్ ఎమ్మెల్యే

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ఇందూర్ జిల్లా మేదరి సంఘం వారి ఆధ్వర్యంలో వినాయక నగర్ విగ్రహాల పార్క్ నందు హనుమాన్ జంక్షన్ లో వారి కుల దైవం కేతేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని, కేతేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లాడుతు విగ్రహా ప్రతిష్టపనకు కృషి చేసిన మేదరి సంఘానికి శుభాకాంక్షలు తెలుపుతూ, చేతివృత్తుల వారికీ బీజేపీ పార్టీ, తను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కేంద్ర ప్రభుత్వం నరేంద్రమోడీ అన్ని రకాల చేతి కుల వృత్తుల వారి అభివృద్ధి, సంక్షేమం, వారికీ చేయూతగా విశ్వకర్మ యోజన పథం తీసుకువచ్చారు అని, ఈ పథకం ధ్వరా చేతివృత్తుల వారికీ అదునతన శిక్షణ ఇవ్వడం శిక్షణ సమయంలో రోజుకి 500, పని ముట్లకు 15,000 శిక్షణ అనంతరం లక్ష నుండి మూడు లక్షల వరకు ఋణం అందించి చేతివృతులకు అండగా నిలుస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమం లో పరమపూజ్య శ్రీశ్రీ ఇమ్మడి బసవ మేదర కేతేశ్వర మహాస్వామి చిత్రదుర్గ కర్ణాటక, నిజామాబాద్ జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు,  దేవేందర్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love