మద్నూర్ లో 24 26 27 28 29 బూతుల్లో ఓటర్ నమోదు కార్యక్రమం

నవతెలంగాణ- మద్నూర్

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అర్హులైన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు బూత్ లెవల్ ఓటర్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసి శనివారం ఆదివారం రెండు రోజులపాటు ఓటర్ నమోదు కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో గల 24 26 27 28 29 ఈ ఐదు బూతుల్లో ఓటర్ నమోదు కోసం శుక్రవారం నాడు బిఎల్ఓ లు అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఓటు హక్కు కోసం వచ్చే అక్టోబర్ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని మార్పులు చేర్పులు చేసుకునే వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని ఈ అవకాశం ఈ రెండు రోజులతో పాటు సెప్టెంబర్ 2 3 తేదీల్లో కూడా ఓటు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు సిబ్బంది తెలిపారు ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన వారు దరఖాస్తులు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోరుతున్నారు.
Spread the love