తుది దశకు అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు

– మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరంలో నిర్మిస్తున్న 125 అడుగుల బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహా నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ట్యాంక్‌ బండ్‌ సమీపంలో 11.5 ఎకరాల్లో నిర్మితమ వుతున్న అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలిం చారు. విగ్రహానికి సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలి పారు. విగ్రహం చుట్టూ ఎలివేషన్‌, స్మృతివనం, సెంట్రల్‌ లైబ్రరరీ, ఫౌంటెన్‌ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. మార్చి చివరి నాటికి నిర్మాణం పనులు పూర్తి అవుతాయాని తెలిపారు. ఏప్రిల్‌లో అంబేద్కర్‌ జన్మదిన వేడుకల సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

Spread the love