నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ యూనియన్ గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్తో పాటు మరో ఐదుగురు నాయకులు చేస్తున్న పాదయాత్రకు టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పాలకుర్తిలో జరిగిన సభలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ రాంచందర్ పాల్గొని మద్దతు తెలిపారు. వారి పాదయాత్రకు సంఘీభావంగా రూ.5వేల నగదును సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, గ్రామ పంచాయతీ కార్మిక నాయకులు సీహెచ్ వెంకటయ్యలకు అందచేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న కృషి గొప్పదనీ, అలాంటి వారి సమస్యలు పరిష్కరించకపోవడం అన్యామన్నారు. వారికి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఇలాంటి సమస్యలతోనే సతమతమవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు.