సవాళ్లను అధిగమిస్తాం : మల్లికార్జున ఖర్గే

రాయిపూర్‌ : కాంగ్రెస్‌ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని, వాటిని ఐక్యత, క్రమశిక్షణ, సంకల్పంతో అధిగమిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ముగిసాయని, ఇది నూతన కాంగ్రెస్‌ ఆవిష్కరణకు దిశానిర్దేశం చేసిందని ఆయన తెలిపారు. ఇక్కడ మూడు రోజుల పాటు జరిగిన ప్లినరీ సమావేశం ముగింపు సందర్భంగా ఆయన ఆదివారం ప్రసంగించారు. జాతీయ స్థాయిలో మన ప్రవర్తన పార్టీలో ప్రతిస్థాయిలో ఉన్న కోట్లాది మంది సహచరులపై ప్రభావం చూపుతుందని ఖర్గే చెప్పారు. కాలంతో పాటు అనేక విషయాలు మారతాయని, ప్రజల ఆకాంక్షలు, అంచనాలు మారతాయని, కొత్త సవాళ్లు పుట్టుకొస్తాయని, కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయని అన్నారు.

Spread the love