నవతెలంగాణ-పెద్దపల్లి టౌన్:
హైద్రాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పూదరి చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం క్విజ్కు సంబందించి వివరాలను చంద్రశేఖర్ విలేకరులకు వెల్లడించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనా రెడ్డి ఆదేశాల మేరకు పోటీలను చేపట్టినట్లు తెలిపారు. 60 మార్కులతో కూడిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుందని, నియోజక వర్గాల వారిగా మంచి ప్రతిభ కనబరిచిన 44 మందికి బహుమతులను అందించనున్నట్లు వివరించారు. మొదటి బహుమతి కింద మహిళలకు చార్జింగ్ స్కూటి, అబ్బాయిలకు ల్యాప్ టాప్, మూడవ బహుమతి ట్యాబ్, ఇతర బహుమతులు ఉంటాయన్నారు. 7661899899 నంబరుకు మిస్ కాల్ ఇచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ లింక్ మొబైలుకు వస్తుందని, అందులో వివరాలు నమోదు చేసి 1221 రెఫరల్ కోడ్ ను నమోదు చేయాలని సూచించారు. జూన్ 2న పరీక్ష ఉంటుందని, జూన్ 1లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.