నాల్గవ పోలీస్ స్టేషన్లో అదృశ్య కేసు నమోదు

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అదృశ్య కేసు నమోదు చేసినట్లు నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ కుమార్ సోమవారం తెలిపారు. ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..  వినాయక్ నగర్ కు చెందిన ఈనెల 29-5-2023న ఫిర్యాదుదారుడు జితకరి దత్తం నిజామాబాద్ నాలుగో పోలీస్ స్టేషన్కు వచ్చి తన తండ్రి కనబడడం లేదని ఫిర్యాదు చేశాడు. జీతకరి బాలయ్య 75 సంవత్సరాలు తన తన కూతురు ఇంటికి వెళ్లి తిరిగి వస్తానని కొడుకు చెప్పి వెళ్ళాడు కానీ అయిన తన కూతురు ఇంటికి ఈనెల 28-5- 2023న ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో తన కూతురు చిట్టే రుద్మకు చెప్పి ఇంట్లో నుండి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.

Spread the love