బాన్సువాడ పరిశుభ్రంగా ఉండాలి

– మున్సిపల్ చైర్మన్ గంగాధర్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ పట్టణంలో పరిషరాల పరిశుభ్రత ను పాటించాలని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ తెలిపారు. బాన్సువాడ పట్టణంలో కొనసాగుతున్న పారిశుభ్రత పనులు శుక్రవారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పారిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తాగునీటిని వృధా చేయరాదు అన్నారు. పారిశుద్ధ సమస్యలను లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జుబేర్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love