ఉపాధి కూలీలకు గ్యారెంటీ కార్డులతో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

నవతెలంగాణ –  రెంజల్

నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు టి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ కోరారు. శుక్రవారం రెంజల్ మండలం కళ్యాపూర్, కూనేపల్లి, గ్రామాలలోని ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాల వివరిస్తూ రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, వస్తే వి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు లక్ష రూపాయలు ఇవ్వడానికి గ్యారెంటీ కార్డులో చేర్చడం జరిగిందన్నారు. దేశంలో హస్తంతోనే మార్పు సాధ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువ న్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం గ్యారెంటీ కార్డుల పొందుపరిచిన వాటిని తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ ఉపాధి కూలీలతో సహా దేశవ్యాప్తంగా కార్మికులందరికీ జాతీయ రోజువారి కనీస వేతనం 400 రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు . పార్లమెంట్ ఎన్నికల అనంతరం రెండు లక్షల లోపు రుణమాఫీ ఉన్న రైతులందరికీ మాపి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జి సాయి రెడ్డి, సిహెచ్ రాములు, ధనుంజయ్, జావీద్ ఉద్దీన్, గియా సోదిన్, ఎమ్మెస్ రమేష్ కుమార్ సురేష్.మోహన్, సాయినాథ్, నీరేడి సాయిలు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్ రాజు, బి రవి, వెంకటి, వేణు, అజ్మత్, గైని కిరణ్, శంషాద్దీన్, సోక్కుల సాయిలు, ఎల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love