కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్‌ఓ

నవతెలంగాణ – జమ్మికుంట : జమ్మికుంట పట్టణం కొత్తపల్లి 19వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం హుజురాబాద్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 26వ తేదీ వరకు శిబిరం కొనసాగుతుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఆయనవెంట కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ సాజిద్‌, డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పంజాల ప్రతాప్‌గౌడ్‌, కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love