నవతెలంగాణ – జమ్మికుంట : జమ్మికుంట పట్టణం కొత్తపల్లి 19వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని బుధవారం హుజురాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ చందు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 26వ తేదీ వరకు శిబిరం కొనసాగుతుందని, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఆయనవెంట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాజిద్, డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్గౌడ్, కంటి వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.