తెలంగాణ దీక్షా దివస్” పేరుతో ధర్నా.. వినతిపత్రం అందజేత..

నవతెలంగాణ- డిచ్ పల్లి
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ 12న “తెలంగాణ దీక్షా దివస్” పేరుతో ధర్నా నిర్వహించాలన్న సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసిల్దార్ శ్రీనివాస్ రావు కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా రూరల్ సబ్ డివిజన్ కార్యదర్శి సాయగౌడ్ మాట్లాడుతూ ఘన్పూర్ శివారులో గల 349 సర్వే నెంబర్ లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని ఆ భూమిని ప్రభుత్వం సర్వే జరిపి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని అలాగే నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని నిరుద్యోగులకు జీవన భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల చేత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిషన్, మోహన్, అనురాధ, ఆమని, గౌసియ, ముంతాజ్ ,తదితరులు పాల్గొన్నారు.

Spread the love