నవతెలంగాణ – డిచ్ పల్లి
వీధికుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. చిన్నారి గ్రామంలో రోడ్డుపై ఆడుకుంటుండగా వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో కింద పడిపోయిన అ చిన్నారి అరవడంతో గమనించిన తల్లి పరుగెతుకొచ్చి కుక్కను తరిమేసింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా గ్రామ పంచాయతీ తమకేమీ పట్టనట్లు వ్యవహ రిస్తున్నారని పలువురు ఆరోపించారు.ఇకనైన అదికారులు
స్పందించి కుక్కలను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.