చిన్నారి పై శునకం దాడి.. గాయాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
వీధికుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన డిచ్ పల్లి మండల కేంద్రంలోని  ఘన్పూర్ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. చిన్నారి గ్రామంలో రోడ్డుపై ఆడుకుంటుండగా వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో కింద పడిపోయిన అ చిన్నారి అరవడంతో గమనించిన తల్లి పరుగెతుకొచ్చి కుక్కను తరిమేసింది. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా గ్రామ పంచాయతీ తమకేమీ పట్టనట్లు వ్యవహ రిస్తున్నారని పలువురు ఆరోపించారు.ఇకనైన అదికారులు
స్పందించి కుక్కలను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Spread the love