గర్షకుర్తి మండలం ఏర్పాటుకు కృషి చేయాలి

– బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడికి వినతి
నవతెలంగాణ – గంగాధర : మండలంలోని మేజర్ గ్రామమైన గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని బీఎస్పీ మండల అధ్యక్షుడు పొత్తూరు సురేష్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందించారు. గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ గర్శకుర్తితో పాటు వివిధ గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాల్సిన ప్రభుత్వం మండల కేంద్రం ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తుందని ఈ విషయంపై ప్రభుత్వానికి నివేదించాలని ఆయన వినతి పత్రంలో కోరారు. మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే గర్షకుర్తి ఆనుకొని ఉన్న పలు గ్రామాల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గర్శకుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటూ హామీనిచ్చి అమలు చేయడం లేదని ఆయన వినతి పత్రంలో పేర్కొన్నారు.

Spread the love