చిత్రగా అలరిస్తా..

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌తో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్న విషయం విదితమే. శ్రీకరా స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సినిమాకి కీలకమైన పవర్‌ ఫుల్‌ పాత్రలలో జోజు జార్జ్‌, అపర్ణా దాస్‌ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల పాత్ర వివరాలను తాజాగా చిత్ర బందం వెల్లడించింది. ఇందులో ఆమె ఉల్లాసభరితంగా, కొంటెగా ఉంటూ అందరి మనసులు దోచుకునే అందమైన ‘చిత్ర’ పాత్రను పోషిస్తున్నారు. తాను పోషిస్తున్న చిత్ర పాత్ర పట్ల శ్రీలీల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటిదాకా చిత్రీకరించిన ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
‘అసురన్‌, ఆడుకాలం’ వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు సంగీతం అందించిన జి.వి. ప్రకాష్‌ కుమార్‌ ఈ చిత్రానికీ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే, నేడు (సోమవారం) ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా
ఈ మూవీ నుంచి అదిరిపోయే యాక్షన్‌ గ్లింప్స్‌ విడుదల కానుంది.

Spread the love