నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ కుప్పకూలింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ ముందు 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. కాగా, ఈ సీజన్లో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్కు ఆరంభం నుంచే ఢిల్లీ షాకులు ఇస్తూ వచ్చింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు చతికిలబడ్డారు. ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. ఒక్క రషీద్ ఖాన్ (31) మాత్రమే జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. కానీ అప్పటికే జట్టు మొత్తం విఫలం కావడంతో 89 పరుగుల వద్దనే గుజరాత్ ఆగిపోయింది.