ఆరోపణలు నిజమే అయితే…

– వారి పేర్లు బయటపెట్టు
– బండి సంజయ్కు నిరంజన్‌ సవాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ నాయకులకు సీఎం కేసీఆర్‌ పాకెట్‌ మనీ ఇస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శలు నిరాధారమైనవని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు నిరంజన్‌ కొట్టిపారేశారు. అదే నిజమైతే వారి పేర్లు బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ పేరోల్‌లో కాంగ్రెస్‌ నాయకులున్నారంటూ బండి అతిపెద్ద అబద్ధమాడారని విమర్శించారు. విశ్వసనీయత లేని నాయకుడు బండిపై ఆ పార్టీ నాయకులే అధిష్టానానికి ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు.

Spread the love