భక్త కన్నప్పగా మంచు విష్ణు

మంచు విష్ణు తాజా చిత్రం ‘కన్నప్ప’ని శుక్రవారం శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. అవా ఎంటర్టైన్మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్‌ ప్లస్‌లో మహాభారత సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు.
కతి సనన్‌ సోదరి నుపుర్‌ సనన్‌ విష్ణు సరసన హీరోయిన్‌గా కనిపించనున్నారు. పరుచూరి గోపాలకష్ణ, బుర్ర సాయి మాధవ్‌, తోట ప్రసాద్‌ ఈ చిత్ర కథకి ప్రధాన ఆకర్షణలను చేర్చారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి మ్యూజిక్‌ సమకూరుస్తున్నారు. ‘అత్యంత భారీబడ్జెట్‌తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో భక్త కన్నప్ప భక్తి, గొప్పతనాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తాం. త్వరలో చిత్రీకరణ మొదలుపెట్టి సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమా మొత్తం కంప్లీట్‌ చేస్తాం. భారతీయ చిత్ర పరిశ్రమ నుండి టాప్‌ నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారు’ అని మంచు విష్ణు తెలిపారు.

Spread the love