మేడే చారిత్రక ప్రాధాన్యత నేపద్యం

నవతెలంగాణ – మల్హర్ రావు
మే డే ని ఏదో సాంప్రదాయకంగా వచ్చే జండాల పండుగ లాగానో, సెలవు దొరికితే ఖుషి చేసే రోజు లాగా కాకుండా, స్వేచ్ఛ స్వాతంత్ర్యం కార్మికుల హక్కుల పరిరక్షణ, దోపిడీ నుంచి విముక్తి కోసం,పోరాటాలను, ముందుకు తీసుకుపోయి, మరిన్నిహక్కులు, సాదించుకునే దినంగా మన సీఐటీయూ జరుపుకుంటున్నది. కార్మికహక్కులకోసం, 8గంటల పనిదినంకోసం, కార్మికులు, రక్తం చిందించిన ఆనాటి నుండి నేటి వరకు పోరాడిన, ప్రస్తుతం, పోరాడుతున్న, త్యాగధనుల స్ఫూర్తిని స్మరించుకుంటూ వారి బాటలో పయనిస్తామని పిడికిలి బిగించి ప్రతిజ్ఞ చేయవలసిన దినం మేడే చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఘటన 1886,మే4న, చికాగో నగరంలో,హేమార్కెట్టు, సెంటరు లో జరిగింది. 8గంటలపని దినాన్ని, అమలు చేయాలనిహేమార్కెట్టుసెంటరులో, వేలాది మంది కార్మికులు,సభ, ఏర్పాటు చేసుకున్నారు.ఆ నగరమేయర్, సభకు అనుమతి కూడా ఇచ్చారు. ఐతే పోలీసులు, కుట్రపూరితంగా, వ్యవహరించి యాజమాన్యాలతో కుమ్మక్కయి, సభముగిచే సమయంలో కిరాయి గూండాలను ఉచిగొలిపి బాంబులను వేయించారు. ఆ బాంబులదాడిలో, కార్మికులతో పాటు, ఒకపోలీసు, అధికారి, చనిపోయాడు. నగరంలో ఇతరులు, కూడాగాయాల పాలయ్యారు.
ఈధాఢిద్వారా,ఉద్యమాన్ని, కర్కశంగా, అణచి వేసి,భయానక, వాతావరణం, స్రుష్టించి, కార్మిక సంఘాల, వారి నాయకులను, బాధ్యులనుజేస్తూ, వందలాది మంది కార్మికులను, కార్మిక నాయకులను, జైళ్ళలో కుక్కి, చిత్రహింసల పెట్టారు.కార్మికుల ఇళ్ళు ధ్వంసం చేశారు. లంచాలు ఇచ్చి సాక్షులను తెచ్చారు. కార్మికులకు,వ్యతిరేకంగా,విషప్రచారం,జేచారు.దైవవ్యతిరేకులుగానునాస్తి కులు గాను, ప్రభుత్వ వ్యతిరేకులుగాఆనాడు పేపర్లలో, కార్టూన్ లు కూడా లవేచారు.బాంబు ధాడితో సంబంధంఉన్నదనేపేరుతో కార్మిక నాయకులకు, ఉరి శిక్ష లేచారు. ఉరిశిక్షనుండిబయటపడాలంటే చేచినతప్పులు, ఒప్పుకొని, క్షమా భిక్ష కోరుకుంటే, శిక్ష తగ్గుతుందని, జడ్జి గారు చెప్పారు.అందుకు, అంగీకారం తెలిపిన వారికి,15సంవత్సరాలు, కఠిన కారాగార శిక్ష విధించారు. ఒకనాయకుడిని, కారాగారం లోనే మందుగుండు సామగ్రి తోపేల్చేచారు. మిగిలిన కార్మిక నాయకులను ఉరి తసింది కర్కశ ప్రభుత్వం.అమెరికా లోని అన్ని ట్రేడ్ యూనియన్ లుఉరిశిక్షలు ఆపమని, తీర్మానాలు చేసి, ప్రభుత్వానికి పంపాయి. పెద్ధప్రదర్శనలు, జరిగాయి. అనేకమందిప్రముఖులు, ఈ శిక్షలను నిరసించారు. ఇంగ్లాండ్, ప్రెంచ్,హాలెండ్, రష్యా,,ఇటాలియన్, చైనా, స్పెయిన్, చికాగో కార్మికులకుమద్ధత్తుగా,నిలిచారు.విరాళాలుకూడా, సేకరించి పంపారు.చికాగోలో కార్మికులు, జైలు గోడలను, బ్రద్దలు కొట్టటానికిపూనుకున్నారు. మరణశిక్ష నుఎదుర్కొంటున్నకార్మికులు, ఈ ఆలోచనలను తిరస్కరించారు. 11నవంబరు1887న ఆవీరులు ఉరితీయబడ్డారు. వేలాది మంది కార్మికులు, అంతిమ యాత్రలో పాల్గొన్నారు.14జూలై1889న,మేడేని, అంతర్, జాతీయలేబర్,డేగా గుర్తించాలని, అంతర్ జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య, తీర్మానించింది.8గంటలపనిదినం, ప్రజా స్వామ్యం, కార్మిక హక్కుల కోసం ఉద్యమించాలని, పిలుపు నిచ్చింది. ఆరోజును,మృత వీరులదినంగా, పాటించాలని, తీర్మానించింది. దానికనుగుణంగానే, ప్రంపంచవ్యాప్తంగా, మేడేజరపబడుతున్నది. దానిలోభాగంగా, మనదేశంలో, మనప్రాంతాలలో, మేడేనిజరుపుకుంటున్నాము. భవిష్యత్తులో, సమస్యల పరిష్కారంకోసం, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం, ప్రభుత్వ  సంస్థల పరిరక్షణ కోసం, ఎనిమిది గంటల పని రక్షణ కోసం, కనీస వేతనం కోసం, రెగ్యులరైజేషన్, ఉద్యోగ భద్రత కోసం, మరిన్ని, ఉద్యమాలు, పోరాటాలు జేస్తానికి, కార్మిక వర్గం ముందు పీఠిన నిలబడుతుందని, ప్రతిజ్ఞ చేద్దాం. కుమార్ యాదవ్ , చింతల. నవ తెలంగాణ మల్హర్ రావు మండలం, భూపాలపల్లి జిల్లా.
Spread the love