రాజంపేట మండలంలో మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమం

నవ తెలంగాణ- రాజంపేట్: రాజంపేట మండలంలోని పోందుర్తి, శివాయిపల్లి, పెద్దయిపల్లి, తలమడ్ల, ఆరేపల్లి లతో పాటు రాజంపేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లో నిర్మించబోయే అమరవీరుల స్మృతీ వనం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా వివిధ కుల సంఘాలు, మహిళల నుండి అమృత కళశంలో మట్టిని సేకరించిన బిజెపి కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు, సైనిక అమర వీరుల త్యాగాలకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీ లో నిర్మించే స్మృతి వనం కోసం దేశం మొత్తం గ్రామాల నుండి మట్టి సేకరణ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్రమోదీ చేపట్టారని అందులో బాగంగా కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజల నుండి మట్టి సేకరిస్తున్నామని ఈ కార్యక్రమంలో మహిళలు, కుల సంఘాల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి దేశ భక్తిని చాటుకుంటున్నారని అన్నారు. అమరుల త్యాగాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే సదుద్దేశంతో మోదీ ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love