పార్ధీవదేహానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలంలోని ధన్వాడ గ్రామానికి చెందిన ఆతుకూరి లింగయ్య శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లింగయ్య పార్ధివ దేహనికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love