బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు

నవతెలంగాణ-రామకృష్ణాపూర్-మందమర్రి : ఇటీవల  గ్రామపంచాయతీలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు గతంలో మాదిరిగానే గ్రామపంచాయతీలో నిర్వహించే ప్రత్యేక సమావేశాలకు బీఆర్ఎస్ నాయకులను మాత్రమే ఆహ్వానిస్తూ ఒంటెద్దు పోకడలు పోతున్నారని మందమర్రి మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జీవన్ కుమార్ ఆరోపించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు ఏ పార్టీకి ప్రాధాన్యం లేకుండా గ్రామంలోని గ్రామస్తులను పెద్ద మనుషులను ఆహ్వానించాల్సి ఉంటుందని అన్నారు. అలాకాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీలోని ప్రత్యేక సమావేశాలకు ఏ పార్టీకి సంబంధం లేకుండా గ్రామస్తులను పెద్దమనుషులను ఆహ్వానించి గ్రామ సమస్యలను చర్చించి అభివృద్ధి తీర్మానాలు చేయాలని  ఉన్నతాధికారులు ఈ విషయంలో కలగజేసుకొని ప్రత్యేక అధికారులను సూచన చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
Spread the love