బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన సామ చిన్న గంగాధర్(54) అనే రైతు కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును శుక్రవారం అందజేశారు. గత సంవత్సరం నవంబర్ 13వ తేదీన సామ చిన్న గంగాధర్ కళ్ళంలో వడ్లు ఆరబోస్తున్న సమయంలో 11కేవీ విద్యుత్తు తీగలకు ట్రాక్టర్ తగిలి విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ శాఖ మృతుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయంను మంజూరు చేసింది. మంజూరైన రూ.5లక్షల ఆర్థిక సహాయంను మృతుడి భార్య సామ అమృతకు మోర్తాడ్ ఏడి  వినోద్, ఏఈ బాల్ రాజ్  చేతుల మీదుగా బాధిత కుటుంబానికి  అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్, మాజీ ఉప సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, మహిపాల్, డిప్యూటీ ఏఈ  రమేష్, మహేష్, శ్రావణ్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love