కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం..

– మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
నేత చేనేత కార్మికులు ఎవరు అధైర్య పడవద్దు అని కార్మికులందరినీ కడుపులో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…చేనేత రంగానికి బీఆర్ఎస్,బీజేపి పార్టీలు ఏం చెయ్యలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం…మెగా టెక్స్ టైల్ ను ఇక్కడి నుండి వేరే చోటికి తరలించి చేనేత కార్మికులను మోసం చేశాయని మండిపడ్డారు. కార్మికులను శ్రమ దోపిడి చేసి బతుకమ్మ చీరల పేరు మీద వందల కోట్లు కేటీఆర్ సంపాదించిండన్నారు.చేనేత రంగం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని..చేనేత కార్మికులను కడుపులో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. నేత కార్మికులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు..ఆత్మహత్యలు చేసుకోవద్దు…సమత్సవరం పాటు నేత కార్మికులకు పని కల్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి కార్యాచరణను రూపొందిస్తున్నారని స్పష్టం చేశారు. సిరిశాల ఉరిశాలగా మారుతుందని మాట్లాడిన కేటీఆర్… మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయక కార్మికులు మనోవేదనకు గురవ్వడానికి కారణం మీరు కాదా అని ప్రశ్నించారు. ఈ  కార్యక్రమంలో  జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, పూర్మని లింగారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కావటి మల్లేశం, శేఖర్,ప్రశాంత్, ప్రశాంత్,సాయికుమార్, శంకర్,కొత్త రవి, ఇక్బాల్, భరత్, బాలు,బాలసాని శ్రీనివాస్, సాయి, ప్రసాద్, పాల్గొన్నారు.

Spread the love