అటవీ సంరక్షణ ప్రధానాధికారిగా ఆర్‌ఎమ్‌ డోబ్రియాల్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అటవీ సంరక్షణ ప్రధానాధికారిగా ఆర్‌ఎస్‌ డోబ్రియాల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆ విధుల్ని అదనపు హౌదాలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయన్నే పూర్తిస్థాయి అధికారిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే అరణ్య భవన్‌లో డోబ్రియాల్‌ బాధ్యతలు స్వీకరించారు.

Spread the love