హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తన 30వ చిత్రం కోసం ‘ధమాకా’ దర్శకుడు త్రినాధ రావు నక్కినతో చేతులు కలిపారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి వరుస హిట్లను అందించిన ప్రొడక్షన్ హౌస్ వారి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ కోసం రంగం సిద్ధం చేస్తోంది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మిస్తుండగా, బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
మంగళవారం ఈ సినిమా గ్రాండ్గా ప్రారంభమైంది. ముహూర్తం షాట్కు విజరు కనకమేడల కెమెరా స్విచాన్ చేయగా, దిల్ రాజు క్లాప్ కొట్టారు. అనిల్ సుంకర తొలి షాట్కి గౌరవ దర్శకత్వం వహించారు. త్రినాధరావు నక్కిన విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే డైలాగ్ రైటర్గా పని చేస్తున్నారు. ఈ కొత్త సినిమా త్రినాథరావు నక్కిన, ప్రసన్నల మార్క్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.