రెండవ దశ ర్యాండమైజేషన్‌ పూర్తి

– జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక అలా
నవతెలంగాణ-పాల్వంచ
జిల్లాలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు పోలింగ్‌ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశ మందిరంలో ఎన్నికల ఎక్స్పెండిచర్‌ అబ్జర్వర్‌ రామ్‌ కుమార్‌ గోపాల్‌ ఐఆర్‌ఎస్‌తో కలిసి ఎన్‌ఐసీ వారు రూపొందించిన సాఫ్ట్‌ వేర్‌ వినియోగిస్తూ ఆన్‌లైన్‌లో పోలింగ్‌ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారి ప్రియాంక అలా మాట్లాడుతూ జిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 962 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, 9 ఆక్సిలరీ పోలింగ్‌ స్టేషన్లు ప్రపోజల్‌ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల అధికారికి పంపడం జరిగినది. రెండవ రాండమైజేషన్‌ ప్రక్రియలో భాగంగా 1162 ప్రిసైడింగ్‌ అధికారులు, 1162 సహాయక ప్రిసైడింగ్‌ అధికారులు, 2,324 ఓపిఓలను కేటాయించనున్నట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు ప్రకారం అదనంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఈ సమావేశంలో ఎలక్షన్స్‌ సూపర్డెంట్‌ ధారా ప్రసాద్‌, ఎన్‌ఐసీ డీఐఓ సుశీల్‌ కుమార్‌, డీఎల్‌ఎంటీ పీ.సాయి కష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Spread the love