ఎంసెట్ ఫలితాల్లో ధర్మారం గురుకుల విద్యార్ధుల ప్రతిభ…

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలం లోని దర్మారం తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాల లో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులు ఎంసెట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ బి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. అగ్రికల్చల్ మెడికల్ విభాగంలో జి జోష్న 2348 , బి సిందూ 3339ర్యాంకు, యస్ సావిత్రి 3552 ,యస్ శ్రీనిక 3826 , బి సాయి పవన 4398,యస్ శ్రీహిత 6567, యం సంజన 7036 , టి సుష్మ 9103ర్యాంకులు సాధించారు. వీరికి వెటర్నరీ సైన్స్ అగ్రికల్చర్ , హార్టికల్చర్ సీట్లు వస్తాయని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో ఆర్ ధనలక్ష్మి10653 , డి శ్రీనిక13187 , కే సిరివెన్నెల13928 , యన్ కీర్తన16124 , యం చామంతి17613 ర్యాంకులు సాధించారు. వీరికి రాష్ట్రం లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీటు వస్తుందని వివరించారు.సత్త చాటిన విద్యార్ధులను కళాశాల ప్రిన్సిపాల్ బి సంగీత, అధ్యాపక బృందం, సిబ్బంది ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Spread the love