కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ -తాడ్వాయి
మండల కేంద్రంలో శుక్ర వారం రోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా టీపీసీసీ, జిల్లా కాంగ్రెస్ పిలుపు మేరకు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి, తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. అనంతరం స్వీట్ లు పంపిణి చేసారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దన్నూరు కొమురయ్య లు మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని ఆంధ్ర రాష్ట్రం లో పార్టీ మనుగడ కోల్పోతుంది అని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు సోనియా గాంధీ కి రుణపడి ఉండాలనీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకోని వచ్చి సోనియా గాంధీ కి బహుమతి గా తెలంగాణ ప్రజలు ఇవ్వాలి అని అన్నారు.  తెలంగాణ ప్రజల కోరికలు నెరవేరాలి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది. కచ్చితంగా మనం అందరం కృషి చేసి తెలంగాణ లో బి ఆర్ ఎస్ పాలనకి చేరామ గీతం పడి మన కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకురావాలనీ అన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love