పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితునికి అప్పగించిన సీఐ

నవతెలంగాణ – చేర్యాల: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్ టెక్నాలజీతో స్వాధీనం చేసుకుని బాధితునికి సీఐ పి.సత్యనారాయణ రెడ్డి,సిబ్బంది ఆదివారం అప్పగించారు.సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రానికి చెందిన బసవరాజు వెంకటేష్ అనే వ్యక్తి తన విఐవిఓ మొబైల్ ఫోను ను ఈ నెల14 న పోగొట్టుకున్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను ఎంటర్ చేసి బ్లాక్ చేశాడు. వెంటనే ఫోన్ దొరికిన వ్యక్తి ఫోన్ లో సిమ్ కార్డు వేసుకోవడంతో ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం చేర్యాల పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న వ్యక్తికి చేర్యాల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా పోగొట్టుకున్న ఫోన్ ను తిరిగి తొందరగా పొందుతారని తెలిపారు.

Spread the love