ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

road accidentనవతెలంగాణ- ఇబ్రహీంపట్నం: ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఇబ్రహీంపట్నం మండలం రాపోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను భానుప్రకాశ్‌, నవీన్‌, నారాయణరెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love