అమెరికాలో మరోసారి కాల్పులు… ముగ్గురి మృతి

నవతెలంగాణ – అమెరికా
అమెరికాలో మరో కాల్పుల ఘటన నమోదైంది. న్యూ మెక్సికో రాష్ట్రంలోని రెడ్ రివర్ నగరంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. కాగా, కాల్పులకు పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు రెడ్ రివర్ నగర మేయర్ లిండా కాల్హన్ తెలిపారు. రెడ్ రివర్ మెమోరియల్ డే సందర్భంగా నిర్వహించిన ఓ మోటార్ సైకిల్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిగాయని వివరించారు. బైకర్ గ్యాంగుల సభ్యులు ఈ కాల్పులు జరిపారని మేయర్ వెల్లడించారు. గాయపడిన వారిని టావోస్ లోని హోలీ క్రాస్ ఆసుపత్రికి, అల్బుక్విర్క్ లోని న్యూ మెక్సికో యూనివర్సిటీ హెల్త్ సెంటర్ కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.

Spread the love