నేడు సుందరయ్య వర్ధంతి

– ముఖ్య అతిథిగా లోక్‌సభ రిటైర్డు సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా 38వ స్మారకోపన్యాసాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 6గంటలకు జరగనుంది.
ఈ సందర్భంగా ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-సవాళ్లు, రాజ్యాగ విలువలు’ అంశంపై లోక్‌సభ రిటైర్డు సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి స్మారకోపన్యాసం చేయనున్నారు.
ఎస్‌వీకే ట్రస్ట్‌ చైర్మెన్‌ బీవీ రాఘవులు అధ్యక్షత వహించనున్నారు. ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయ్ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Spread the love