కలిసి కట్టుగా బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎంపిగా గెలిపిద్దం..

– మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్..

నవతెలంగాణ-డిచ్ పల్లి : బిఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని, నిజామాబాద్ ఎంపీ గా బాజిరెడ్డి గోవర్ధన్ విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్ అన్నారు.శుక్రవారం రాత్రి ఇందల్ వాయి మండలంలోని   లోలం గ్రామంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ శాసన సభా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మరోసారి ప్రజలకు మోసగించడానికి అమలు కాని హామీ లను ఇస్తుందన్నారు.బిజెపి పార్టీ అబివృద్ధి చేయకుండా కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చుస్తుందని అన్నారు.ప్రతి ఒక్క కార్యకర్తలు బుత్ ల వారిగా అదిక మెజార్టీ వచ్చే విధంగా చూడాలని సూచించారు.ఈ సమావేశానికి జడ్పీ టీసి గడ్డం సుమన రావిరెడ్డి, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువేరి గంగదాస్, మోహన్ నాయక్, ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశంకుమార్, తిర్మన్ పల్లి ఎంపిటిసి చింతల దాస్,కుంట నర్సారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దాస్,మాజీ సర్పంచ్  శ్రీనివాస్, జలెందర్, లింబద్రి, డీకోండ సుదిర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love