మలేషియాలో రెండు నేవీ హెలికాప్టర్లు ఢీ

Two Navy helicopters collide in Malaysia– పది మంది మృతి
కౌలాలంపూర్‌ : మలేషియాలో రెండు నేవీ హెలికాప్టర్లు మంగళవారం ఢీకొీన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది నేవీ సిబ్బంది మరణించినట్లు మలేషియా నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ రాష్ట్రమైన పెరాక్‌లోని లుముట్‌ నౌకాదళ స్థావరం వద్ద మంగళవారం ఉదయం 9.32 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సిబ్బంది అంతా ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారించింది.

Spread the love