ప్రజ్ఞ ఐఐటి పాఠశాలలో విజయోత్సవ సంబరాలు

నవతెలంగాణ -ఆర్మూర్ 

పట్టణంలోని ప్రజ్ఞ ఐఐటి పాఠశాల లో శనివారం చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడు మీద దక్షిణ భాగంలో అడుగుపెట్టిన సందర్భంగా భారతదేశ పటం ఆకారంలో విద్యార్థులు ఏర్పడి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రోమా వంశీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ప్రపంచం భారతదేశం వైపు చూసేలా శాస్త్రవేత్తలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..
Spread the love