డబ్బు చుట్టూ తిరిగే కథ

ఐక్యూ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ప్రణవ్‌చంద్ర, మాళవిక సతీషన్‌, అజరు గోష్‌, బిత్తిరి సత్తి, మాస్టర్‌ చక్రి, జెమిని సురేష్‌ నటీనటులుగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత. సరికొత్త కామెడీ థ్రిల్లర్‌గా నిర్మితమైన ఈ చిత్రం మార్చి 11న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకులు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ, ‘శివ నాగేశ్వరావు చాలా సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉన్న వ్యక్తి. తనకున్న సెన్సాఫ్‌ హ్యూమర్‌ మాకు కూడా లేదు. తను ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించారు. మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌, పాటలు బాగున్నాయి. ఇందులో నటించిన నటులకు, టెక్నీషియన్స్‌కు, నిర్మాతలకు ఈ సినిమా బిగ్‌ హిట్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ఈ కథ మొత్తం డబ్బుకి సంబంధించిన అంశం చుట్టూ జరుగుతుంది. ప్రస్తుత సమాజంలో ఇంటినుండి బయటికి వచ్చిన తరువాత మనల్ని రకరకాలుగా దోచుకుంటున్నారు. ఇంతకు ముందు ఎవర్ని దోచుకోవాలో సెలెక్ట్‌ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్‌ చేసుకుంటున్నాం. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్‌తో పాటు ఫుల్‌ అవుట్‌ అండ్‌ కామెడీ థ్రిల్లర్‌ కూడా ఉంటుంది’ అని దర్శకుడు శివ నాగేశ్వరావు అన్నారు. నిర్మాత బొడ్డు కోటేశ్వరరావు మాట్లాడుతూ, ‘శివ నాగేశ్వరరావు సినిమాలలో ఉన్న కామెడీ, వినోదాన్ని ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తారు. ఇప్పుడు మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న మా సినిమా కూడా అంతే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు.

Spread the love