రాష్ట్రమంతా గంతేనా !?

ఎవరైనా ఒక్కోపాలీ నోరుజారుతరట! దాన్నే నోటిదూల అని మనం అనుకుంటుంటం. అయితే కాకలు తీరిన మహాయోధుడు, ఉద్యమ నేత సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌ ఎన్నికల సభలో మాట్లాడిన మాటలు ఇని జనం సోంచాబట్టిరి. ముక్కుమీద వేలేసుకోబట్టిరి. ఏమిటా మాటలు? గంతగానం ఏం చర్చ జరగబట్టే అను కుంటున్నారుల్లా.. గదేమంటే గజ్వేల్‌ అనుకున్నంత అభివృద్ధి కాలే..మల్లోపాలీ అధికారమిస్తే రాష్ట్రానికే తలమాని కంజేస్తా అని అన్నడు. గదీ జనానికి వేరేతీరుగ అర్థం కాబట్టే. గజ్వేలే అభివృద్ధి చేయకపోతే, ఇగ రాష్ట్రమంతా ఏం జేసినట్టు నువ్వు? అని చెవులు కొరుక్కోబట్టిరి. కేసీఆర్‌ సార్‌ అధికారం కోసమే అట్లా అన్నా, జనం ఇంకోతీరుగా అర్థం చేసుకోబట్టిరి. దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ అన్న మన సీఎం, ఎన్నికల సభలో ఉల్టా, పల్టా మాటలకు జనం జరంత నొసలు చిట్లించబట్టిరి. సూడుర్రీ ఎవరికైనా పిసరకాయంత ఎర్రీ ఉంటదంట. సరేగానీ ముచ్చట ఒడిసింది, ఇక మీరు ఇంటికిపోర్రీ. నేను ఓటు ఎవరికి ఎయ్యాలనో జరంత సోంచాయించుకుంట.
– బి.బసవపున్నయ్య

 

Spread the love