మహిళా జర్నలిస్టుపై చేయి చేసుకున్న మ‌రో రిపోర్టర్..


నవతెలంగాణ – కర్నాటక: కర్నాటకకు చెందిన ANI రిపోర్టర్.. పీటీఐ మహిళా జర్నలిస్టును చెంపమీద కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. లోక్‌స‌భ ఎన్నికలలో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బ‌హిరంగ‌ సభలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘ‌ట‌న‌పై పీటీఐతో పాటు ప‌లు జ‌ర్న‌లిస్టు సంఘాలు, ఏఎన్ఐ(ANI)కి వ్య‌తేరేకంగా పోస్టులు పెడుతున్నారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై ANI రిపోర్టర్ మీదా FIR నమోదు చేసిన‌ట్లు పీటీఐ వెల్ల‌డించింది.

Spread the love