‘సహ పాఠ్యాంశాలతోనే సమగ్రాభివృద్ధి

'సహ పాఠ్యాంశాలతోనే సమగ్రాభివృద్ధిక్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సహ పాఠ్యాంశాలు, జీవన నైపుణ్యాలు బోధించడానికి ప్రాథమిక, సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల బోధన నామమాత్రంగా కొనసాగుతుంది.వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైన ఈ అంశాలు నేర్పడానికి పాఠ్యపుస్తకాలు రూ పొందించి, విధిగా ఉపాధ్యాయ నియామకాలు చేయాలి. ప్రతి తరగతి ప్రగతి నివేదనలో ఈ అంశాలను చేర్చాలి. భావి భారత పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ సహ పాఠ్యాంశాలు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సహ పాఠ్యాంశాల బోధన జరిగేలా చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు. వ్యక్తుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
మనిషి భౌతిక వాదం, ధన దాహం, నిరంకుశత్వం, స్వార్థం స్వాభిమానం,ప్రాంతీయత వాదం, కుల,మత వాదం వంటి వాటికి బలై తన ఉనికి కోల్పోయి మానవత్వానికి, నైతిక విలువలకు దూరమయ్యాడు. ఈ పరిణామ లక్షణాలే నేటి సమాజంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక స్పృహ లోపించడం, నేర ప్రవృత్తి పెరగడం, నైతిక విలువలు క్షీణించడం, మానసిక కుంగుబాటుతనం, శ్రమ విలువ తెలియకపోవడం, సామాజిక సమన్వయ లోపం, శారీరకధృడత్వం లోపించడం, జీవన నైపుణ్యాలు లేకపోవడం వంటివి.
గడిచిన 30 ఏండ్లలో విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. గతంలో విద్య వ్యక్తి పరిపూర్ణత సిద్దించేలా ఉండేది. నేడు జ్ఞాన సముపార్జన పై మాత్రమే దృష్టి పెడుతూ సహ పాఠ్యాంశాలు, జీవన నైపుణ్యాలు నేర్పించడంలో వెనుకబడ్డాము. సమాజంలో అనేక రుగ్మతలకు మనమే కారకులము అవుతున్నాము.విద్య అనగా జ్ఞాన సముపార్జన, నైపుణ్యాలను అభివృద్ధి చేసే ప్రక్రియ. వ్యక్తి తనకు తెలియని విషయాలను తెలుసుకునే ప్రక్రియ.విద్య వ్యక్తులను శక్తివంతంగా తయారు చేసి, సమాజానికి మేలు చేసేలా చేస్తుంది. అలాగే డబ్బు సంపాదించేలా చేసి స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతకడానికి వీలు కల్పిస్తుంది. వ్యక్తి పుట్టుకతోనే విద్య నేర్చుకోవడం ఆరంభిస్తాడు. ఎరుకలేని విషయాలను ఎరుక చేసేదే విద్య. వ్యక్తులు పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలంటే ఉత్తమమైన పౌరులుగా ఎదగాలంటే విద్యార్థి దశలో పాఠ్యాంశాలతో పాటు సహ పాఠ్యాంశాలను విధిగా నేర్పాలి.
శారీరక, ఆరోగ్య విద్య కళలు ,సాంస్కృతిక విద్య, పని విద్య, కంప్యూటర్‌, విలువ విద్య ,జీవిత నైపుణ్యాలు మొదలైనవి సహ పాఠ్యాంశాలు.సమర్థవంతంగా సమాచారాన్ని ఇవ్వడం, సమస్యలను గుర్తించి పరిష్కారాన్ని కనుగొనడం, విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించడం, ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ఇతరులతో సానుభూతి కలిగి ఉండడంవంటివి జీవన నైపుణ్యాలు.జీవన నైపుణ్యాల ఆధారిత విద్య (ఎల్‌ఎస్‌బిఈ) అనేది స్వీయ ప్రతిబింబం,విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కారం మరియు వ్యక్తుల మధ్య సంబంధాలు,వ్యక్తిగత జీవిత నైపుణ్యాలను పెంపొందించిన పై దృష్టి సారించేది.
శారీరక విద్య క్రీడలు, కుటుంబం, తోటి వారితో సామాజిక సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా సామాజిక శ్రేయస్సుకుతోడ్పడతాయి సానుకూల సామాజిక దృక్పథాలు అభివృద్ధి చెందుతాయి. ఓటమిని కూడా తట్టుకొని నిలబడటానికి స్ఫూర్తి పొంది విజేతలుగా నిలుస్తారు. ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మహత్యలు తగ్గుతాయి. ఆరోగ్యవంతమైన శరీరంలోని ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది.నైతిక విలువలు ఒక వ్యక్తికి మంచి చెడు అని తేడా గుర్తించడానికి సమాజంలోని వ్యక్తులందరూ జీవించడానికి అనుసరించాల్సిన ఆమోదయోగ్యమైన ప్రవర్తన నియమావళిని అందిస్తుంది.సమాజంలో ప్రబలుతున్న హింస, అవినీతి, అక్రమాలు, నిజాయితీపై విద్యార్థులకు అవగాహన కోసం,వాటికి ప్రభావితం కాకుండా విద్యార్థులను సిద్ధం చేస్తుంది. మానసిక సంఘర్షణతో కూడిన పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచడంతో విద్యార్థులకు నైతిక విలువలు ఎంతో ఉపయోగపడుతాయి.
జీవన నైపుణ్యాలు రోజువారి సవాళ్లను మరింత సులభంగా అర్ధం చేసుకోవడానికి, విమర్శనాత్మక ఆలోచన, సమస్యా పరిష్కార సామర్ధ్యాలను ప్రోత్సహించేలా చేస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి జీవన నైపుణ్యాలు దోహదపడతాయి.కంప్యూటర్‌ విద్యతో డేటా మేనేజ్‌ మేనేజ్మెంట్‌, కమ్యూనికేషన్‌ రీసెర్చ్‌, ప్రజెంటేషన్‌ వంటి పనులు వేగంగా సమర్థవంతంగా చేయగలం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కమ్యూనికేషన్స్‌ సమాచారం మార్పిడి సులభతరం అవుతుంది. సాంకేతిక పరిజ్ఞానంలో నూతన ఒరవడులను అందు కోగలుగుతాము.విద్యార్థుల ఉల్లాసం కోసం మాత్రమే కాదు శారీరక మానసిక వికాసంలో సహా పాఠ్యాంశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. నాయకత్వం, ఆత్మవిశ్వాసం, సాంఘికరణం పెరుగుతుంది.పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు పర్యావరణాన్ని విద్య ఆవశ్యకత. పర్యావరణాన్ని మనం కాపాడుకోగలిగితే మానవాళిని ప్రకృతి కాపాడుతుంది.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సహ పాఠ్యాంశాలు, జీవన నైపుణ్యాలు బోధించడానికి ప్రాథమిక, సెకండరీ స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల బోధన నామమాత్రంగా కొనసాగుతుంది.వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైన ఈ అంశాలు నేర్పడానికి పాఠ్యపుస్తకాలు రూ పొందించి, విధిగా ఉపాధ్యాయ నియామకాలు చేయాలి. ప్రతి తరగతి ప్రగతి నివేదనలో ఈ అంశాలను చేర్చాలి.
భావి భారత పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ సహ పాఠ్యాంశాలు ఎంతో ఉపయోగపడతాయి. అందువల్ల వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి సహ పాఠ్యాంశాల బోధన జరిగేలా చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చు. వ్యక్తుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.
పాఠశాల స్థాయిలో సంగీతం, నాట్యం కలలు క్లబ్‌ లు (సైన్స్‌ క్లబ్‌ మాథ్స్‌ క్లబ్‌) టాలెంట్‌ షోలు, డ్రాయింగ్‌ కాంపిటీషన్లు డిబేట్లు, సెమినార్లు, కథలు, కవితలు, పాటలపై వర్క్‌షాప్‌లు ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, క్రీడా పోటీలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం, యోగా, వ్యక్తిత్వ వికాస శిక్షణలు, క్షేత్రస్థాయి పర్యటనలు, విజ్ఞాన వినోదాన్ని పెంచడానికి విజ్ఞాన యాత్రలు వంటివి నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం, శ్రమ విలువ, క్షేత్రస్థాయి అనుభవాలు, సమన్వయం క్రీడాస్పూర్తి సృజనాత్మకత,, వినోదాత్మకత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ పరిరక్షణలపై అవగాహన పెరిగి నవభారత నిర్మాణంలో క్రియాశీల పాత్ర పోషించగలరు. వ్యక్తిత్వ వికాసానికి సహ పాఠ్యాంశాలు జీవన నైపుణ్యాలు ఎంతో ఉపయోగపడతాయి.
పరిపూర్ణమైన వ్యక్తులుగా రూపొందాలంటే విద్యార్థి దశలోనే పాఠ్యాంశాలతో పాటు, సహ పాఠ్యాంశాల బోధన, జీవన నైపణ్యాల అభివృద్ధి తప్పనిసరిగా జరగాలి. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అన్నట్లుగా నేటి బాలలను శారీరక, మానసిక ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిది.
పాకాల శంకర్‌ గౌడ్‌ 9848377734

Spread the love